|

రక్షణ మంత్రిత్వ శాఖ రహస్యాలు చోరీ..?

కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోనీ కార్యాలయంలో గూఢచర్యం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 16న ఆంటోనీ ఆఫీస్ కార్యాలయంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపమని ఇంటెలిజెన్స్ బ్యూరోనూ రక్షణ శాఖ ఆదేశించింది. మంత్రిత్వశాఖకు చెందిన టెలిఫోన్ లైన్స్ ను గమనిస్తూ ఉండే ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. అయితే.. మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం తమ టెలిఫోన్ లైన్స్ ను చెక్ చేయడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. నిరుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

Posted by mla mana on 2:49 PM. Filed under , , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

0 వ్యాఖ్యలు for "రక్షణ మంత్రిత్వ శాఖ రహస్యాలు చోరీ..?"

Leave a reply

మరిన్ని పోస్టులు

Labels

మీ ఎమ్మెల్యే గురించి పూర్తి వివరాలు
తెలుసుకోవడం కోసం కింద లిస్టులోనుంచి
మీ జిల్లాను ఎంచుకోండి


Recently Added

Recently Commented