5:11 PM | Posted by mla mana
జగన్ వర్గం గ్రూప్ ఆశించింది ఎట్టకేలకు జరిగింది. సీబీఐ FIR లో వైఎస్సార్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆగస్టు 24, 2011న నెల్లూరు ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలిన ఆయన ప్రస్తుతం జగన్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇంతకాలం ఈ రాజీనామా వ్యవహారం పెండింగ్లో ఉంది.ఈ నేపథ్యంలోనే, రాష్ట్రంలోనూ జగన్ గ్రూప్ ఎమ్మెల్యేల రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఆలస్యం చేస్తున్నారన్న విమర్శ ఉంది. అయితే, ఇవాళ ఉదయం స్పీకర్ మరోసారి మేకపాటిని రాజీనామాపై వివరణ కోరారు. ఆయన రాజీనామాకే కట్టుబడి ఉన్నానని ప్రకటించడంతో... ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. నెల్లూరు జిల్లాలో మరో ఉపఎన్నికకు రంగం సిద్దమవుతోంది.